DC vs GG : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) భారీ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన ఢిల్లీ గుజరాత్పై రెచ్చిపోయింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ జెయింట్స్పై 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ ఓపెనర్ షఫాలీ వర్మ (Shafali Verma) (76)సుడిగాలి ఇన్నింగ్స్ ఆడడంతో 7.1 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ మూడో ఓటమిని ఖాతాలో వేసుకుంది.
స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. కెప్టెన్ మేగ్ లానింగ్ (21) నిదానంగా ఆడింది. కానీ, డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ (76) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడింది. 19 బంతుల్లోనే ఆమె అర్ధ శతకం బాదడం విశేషం. ఆ తర్వాత కూడా షఫాలీ జోరు తగ్గలేదు. ఏడో ఓవర్ మొదటి బంతికి లానింగ్ ఫోర్ కొట్టడంతో ఢిల్లీ విజయం సాధించింది. డబ్ల్యూపీఎల్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసన మరిజానే కాప్కి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ దక్కింది. నాలుగు ఓవర్లలో 15 పరుగులిచ్చి 5 వికెట్లు కూల్చి గుజరాత్ను దెబ్బ తీసింది.
గత మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై విఫలం అయిన షఫాలీ పవర్ హిట్టింగ్తో గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడింది. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపింది. ఫోర్లు, సిక్స్లతో డీవై పాటిల్ స్టేడియాన్ని హోరెత్తించింది. నాలుగో ఓవర్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ దంచింది. దాంతో ఆ ఓవర్లో 22 రన్స్ వచ్చాయి. షఫాలీ ధాటికి ఢిల్లీ పవర్ ప్లేలో 87 పరుగులు చేసింది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 9 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. మరిజానే కాప్ ఐదు వికెట్లతో గుజరాత్ను కోలుకోలేని దెబ్బ తీసింది. మొదటి ఓవర్ రెండో రెండో బంతికి సబ్బినేని మేఘన (0)ను బౌల్డ్ చేసింది. తన రెండో ఓవర్లో లారా వొల్వార్డ్త్(1), అష్ గార్డ్నర్ను వెనక్కి పంపింది. రెండో బంతికి ను బౌల్డ్ చేసింది. దాంతో, 9 పరుగులకే ఆ జట్టు మూడు వికెట్లు పడ్డాయి. హర్లిన్ డియోల్ (20) తక్కువ రన్స్కే ఔట్ అయింది. దయలాన్ హేమలత (5) పెవిలియన్ చేరింది. 66 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. దాంతో, ఆ జట్టు 100 లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ, కిమ్ గార్త్ (32, తనూజా కన్వార్ (13) ఎనిమిదో వికెట్కు అత్యధికంగా 28 రన్స్ జోడించారు. కెప్టెన్ స్నేహ్ రానా (2), సుష్మా వర్మ (2) విఫలం అయ్యారు. ఢిల్లీ బౌలర్లలో శిఖాపాండే మూడు, రాధా యాదవ్ ఒక వికెట్ తీశారు.