Achanta Sharath Kamal | న్యూఢిల్లీ: ఈ ఏడాది జూలై-ఆగస్టులో జరుగనున్న ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో భారత పతాకధారిగా టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్కమల్ వ్యవహరించనున్నాడు.లండన్(2012) ఒలింపిక్స్ కాంస్య విజేత, దిగ్గజ బాక్సర్ మేరీకోమ్..చెఫ్ డీ మిషన్గాఎంపికైంది.
ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) గురువారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. మేరీకోమ్కు అసిస్టెంట్గా శివ కేశవన్ డిప్యూటీ చెఫ్ డి మిషన్గా ఎంపికవగా గగన్ నారంగ్.. భారత షూటింగ్ టీమ్కు పర్యవేక్షకుడిగా ఉండనున్నాడు.