లండన్: బుమ్రా, షమీలు ఇంగ్లండ్కు చుక్కలు చూపించారు. షమీ తన టెస్ట్ కెరీర్లో రెండవ హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. బుమ్రా కూడా అర్థశతకం వైపు పరుగులు తీస్తున్నాడు. ఇంగ్లండ్తో ( India Vs England )జరుగుతున్న రెండవ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్ బుమ్రా, షమీలు విరోచిత పోరాటం చేస్తున్నారు. లార్డ్స్లో అయిదో రోజు భోజన విరామ సమయానికి ఇండియా తన రెండవ ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 286 రన్స్ చేసింది. షమీ 53, బుమ్రా 30 రన్స్తో క్రీజ్లో ఉన్నారు. ఇవాళ తొలి సెషన్లో 25 ఓవర్లలో ఇండియా 104 పరుగులు జోడించింది. రిషబ్ పంత్ విఫలమైనా.. లోయర్ ఆర్డర్ ఆడిన తీరు ఆకట్టుకున్నది.
షమీ, బుమ్రాలు తిమ్మిదో వికెట్కు అజేయంగా ఇప్పటి వరకు 77 రన్స్ జోడించారు. ఇవాళ ఉదయం అయిదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు ఆరంభంలోనే జలక్ తగిలింది. పంత్ ఔట్ కావడంతో.. మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మళ్లినట్లు అనిపించింది. కానీ బుమ్రా, షమీలు.. ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లేరీతిలో పోరాడారు. ఇంగ్లండ్ పేస్ బౌలర్లను ధాటికి ఎదుర్కొన్నారు.
ఇంగ్లండ్ ఎన్ని ఎత్తులు వేసినా.. ఈ ఇద్దరూ రక్షణాత్మక ఇన్నింగ్స్తో ఇంగ్లండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. బుమ్రా హెల్మెట్కు పలుమార్లు బంతి తగిలినా.. పట్టవదలని దీక్షతో బ్యాటింగ్ చేశాడు. షమీ కూడా భారీ షాట్లతో అలరించి ఇంగ్లండ్ ఆటగాళ్లను కన్ఫ్యూజ్ చేశాడు. ప్రస్తుతం ఇండియా 259 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇవాళ ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలి ఉంది.