Mohammed Shami | దుబాయ్ : నవంబర్ నెలకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఐసీసీ నామినేట్ చేసినవారిలో భారత పేసర్ మహ్మద్ షమీ పేరును జోడించారు. ఇటీవల ఇండియా నిర్వహించిన వన్డే ప్రపంచకప్లో విశేష ప్రతిభ కనబరిచిన షమి, ఆస్ట్రేలియా ఆటగాళ్లు గ్లెన్ మాక్స్వెల్, ట్రావిస్ హెడ్ పేర్లను ఐసీసీ ఈ అవార్డుకు నామినేట్ చేసింది.
కాగా మహిళా విభాగంలో ఇద్దరు బంగ్లా క్రీడాకారిణులు, ఒక పాకిస్తాన్ క్రీడాకారిణి పేర్లు నామినేట్ అయ్యాయి. ఆ రెండు జట్ల మధ్య జరిగిన సిరీస్లో బంగ్లా ప్లేయర్లలో బంతితో చెలరేగిన నహీదా అక్తర్, బ్యాట్తో రాణించిన ఫర్జానా హక్, పాకిస్థాన్ బౌలర్ సాదియా ఇక్బాల్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు.