లండన్: ఇంగ్లండ్తో ( India Vs England )జరుగుతున్న రెండవ టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్ బుమ్రా, షమీలు విరోచిత పోరాటం చేస్తున్నారు. ఇంగ్లండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఆ ఇద్దరూ తిమ్మిదో వికెట్కు అజేయంగా 50 పరుగులు జోడించారు. ఇవాళ ఉదయం అయిదో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు ఆరంభంలోనే జలక్ తగిలింది. పంత్ ఔట్ కావడంతో.. మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మళ్లినట్లు అనిపించింది. కానీ బుమ్రా, షమీలు.. ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లేరీతిలో పోరాడుతున్నారు. ఇంగ్లండ్ పేస్ బౌలర్లను ధాటికి ఎదుర్కొంటున్నారు. ఇంగ్లండ్ ఎన్ని ఎత్తులు వేసినా.. ఈ ఇద్దరూ రక్షణాత్మక ఇన్నింగ్స్ ఆడుతున్నారు. బుమ్రా హెల్మెట్కు పలుమార్లు బంతి తగిలినా.. పట్టవదలని దీక్షతో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే రెండవ ఇన్నింగ్స్లో ఇండియా ఆధిక్యం 200 దాటింది. తాజా సమాచారం అందేవరకు బుమ్రా 25 , షమీ 50 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. 57 బంతుల్లో షమీ హాఫ్ సెంచరీ చేశాడు.ఇండియాను ఆలౌట్ చేస్తే, ఇంగ్లండ్ ఆ టార్గెట్ను ఇవాళే అందుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇండియా రెండవ ఇన్నింగ్స్లో 106 ఓవర్లలో 8 వికెట్లకు 284 రన్స్ చేసింది.