హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) విద్యార్థులు క్రీడల్లో సత్తాచాటుతున్నారు. బరిలోకి దిగిన ప్రతీ టోర్నీలో ప్రతిభ కనబరుస్తూ పతకాలు కొల్లగొడుతున్నారు. జపాన్ వేదికగా ఈ నెలలో జరిగే ఆసియా సాఫ్ట్బాల్ టోర్నీ(అండర్-15, అండర్-18)కి గురుకులాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.
వీరంతా ఆసియాకప్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇందులో సౌమ్యరాణి, సాత్విక, సౌందర్య, సరయు, కార్తీక, స్రావిక, వినయ్ ఉన్నారు. ఆసియా సాఫ్ట్బాల్ టోర్నీకి ఎంపికైన వీరిని మంగళవారం గురుకులాల కార్యదర్శి రొనాల్డ్ రాస్ ప్రత్యేకంగా అభినందించారు.