క్రైస్ట్చర్చ్: సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (115) సెంచరీ బాదడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక మంచి స్థితిలో నిలిచింది. మాథ్యూస్తో పాటు దినేశ్ చండిమల్ (42), ధనంజయ డిసిల్వ (47) రాణించడంతో లంక రెండో ఇన్నింగ్స్లో 302 పరుగులు చేసింది.
అనంతరం 285 పరుగుల లక్ష్యఛేదనలో ఆదివారం నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. చేతిలో 9 వికెట్లు ఉన్న కివీస్ విజయానికి ఇంకా 257 పరుగులు చేయాల్సి ఉంది. కాన్వే (5) ఔట్ కాగా.. లాథమ్ (11), విలియమ్సన్ (7) క్రీజులో ఉన్నారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 355 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 373 రన్స్ చేసింది.