హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశంలో ఫుట్బాల్ క్రీడను అభివృద్ధి చేసే క్రమంలో సుప్రీం కోర్టు నియమించిన సీవోఏ బృందం..ఫిఫా, ఆసియా ఫుట్బాల్ సమాఖ్య(ఏఎఫ్సీ) ప్రతినిధులను కలుసుకుంది. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్) రాజ్యంగ మార్పు, ఎన్నికలను ఎలా నిర్వహించాలనే దానిపై ప్రధానంగా చర్చ జరిగింది. మొత్తం 24 ఐ-లీగ్, ఐఎస్ఎల్ నుంచి మూడేసి జట్ల చొప్పున ఆరింటికి చోటు కల్పించారు.
ఇందులో శ్రీనిధి దక్కన్ ఎఫ్సీ, మొహమ్మదీన్ ఎస్సీ, గోకులమ్ కేరళ, హైదరాబాద్ ఎఫ్సీ, ఏటీకే మోహన్బగాన్, ఎఫ్సీ గోవా చోటు కల్పించారు. అయితే తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్(టీఎఫ్ఏ) అధ్యక్షుడు కేటీ మాహే సారథ్యంఒలో శ్రీనిధి దక్కన్ ఎఫ్సీ బృందం ఫిఫా, ఏఎఫ్సీ ప్రతినిధులను గురువారం కలిశారు. ఈ బృందంలో కేటీ మహేతో పాటు అభిజిత్రావు, విక్రమ్రావు, ఫాబియో తదితరులు ఉన్నారు.