హాంగ్జూ: ఆసియా క్రీడల్లో భారత్కు మరో సిల్వర్ మెడల్ దక్కింది. స్క్వాష్లో భారత క్రీడాకారుడు సౌరవ్ గోశాల్(Saurav Ghosal) ఆ మెడల్ను గెలుచుకున్నాడు. మలేషియాకు చెందిన ఇయాన్ యోవ్తో జరిగిన మ్యాచ్లో సౌరవ్ తీవ్రంగా పోరాడాడు. తొలి గేమ్లో సౌరవ్ 11-9 స్కోరుతో ఈజీగా గెలిచాడు. అయితే రెండవ గేమ్లో ఇయాన్ అద్భుతమైన రీతిలో పోటీ ఇచ్చాడు. చాలా థ్రిల్లింగ్ సాగిన ఆ గేమ్లో అతను 11-9 స్కోరుతో గెలిచాడు. మూడవ గేమ్లో కూడా మలేషియా క్రీడాకారుడు అద్భుత ఆటతీరును ప్రదర్శించారు. దీంతో సౌరవ్ రజత పతకానికి మాత్రమే ఫిక్స్ కావాల్సి వచ్చింది. హాంగ్జూ క్రీడల్లో భారత్ మొత్తం పతకాల సంఖ్య ప్రస్తుతం 85కు చేరుకున్నది. 21 బంగారం, 31 కాంస్యం, 32 రజత పతకాలు ఇండియా ఖాతాలో ఉన్నాయి. పతకాల పట్టికలో ఇండియా నాలుగవ స్థానంలో ఉంది.