న్యూఢిల్లీ: భారత స్టార్ ప్యాడ్లర్ సాతియాన్ క్రొయేషియా వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) కంటెండర్ టోర్నీలో సంచలనం సృష్టించాడు. గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో సాతియాన్ 6-11, 12-10, 11-9, 12-10తో ప్రపంచ ఆరో ర్యాంకర్ జార్గిక్ డార్కో (స్లొవేనియా)పై విజయం సాధించి ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లాడు.
టాప్-10 ర్యాంకర్పై సాతియాన్కు ఇది రెండో విజయం కావడం విశేషం. ‘అన్నీ అస్త్రశస్ర్తాలను వినియోగించుకొని ప్రపంచ ఆరో ర్యాంకర్, యూరోపియన్ కప్ చాంపియన్పై విజయం సాధించా’ అని సాతియాన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్లో 38వ స్థానంలో ఉన్న సాతియాన్.. వచ్చే నెలలో బర్మింగ్హామ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్లో పతకం సాధించడమే లక్ష్యంగా విదేశీ టోర్నీల్లో పాల్గొంటున్నాడు.