Satwik – Chirag : భారత స్టార్ డబుల్స్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి మరో మెగా టోర్నీ నుంచి వైదొలిగారు. ఇప్పటికే గాయం కారణంగా స్విస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ ముందే నిష్క్రమించిన ఈ జోడీ ప్రతిష్ఠాత్మక బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్స్(Badminton Asain Championships)లో ఆడడం లేదు. సాత్విక్ భుజం గాయంతో బాధ పడుతున్నందున టోర్నీ నుంచి వైదొలగుతున్నట్టు పీటీఐ(PTI) వార్తా సంస్థతో కోచ్ టాన్ కిమ్ హెర్ వెల్లడించాడు.
ఆ ఏడాది సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టిలకు కలిసి రావడం లేదు. ఈ మధ్య కాలంలో వీరిద్దరు ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నారు. గాయం కారణంగా స్విస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో ఆడలేకపోయిన భారత జోడీ.. మరోసారి గాయం వల్లనే బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్స్లో ఆడడం లేదు. 2023లో విజేతగా నిలిచిన సాత్విక్ – చిరాగ్ జంట నిష్క్రమణతో లక్ష్య సేన్, పీవీ సింధులపైనే పతకం ఆశలు పెట్టుకుంది భారత్.
🚨 BREAKING 🚨
Satwiksairaj Rankireddy & Chirag Shetty pulled out from the Badminton Asia Championships due to Satwik’s shoulder injury. (PTI)#Badminton pic.twitter.com/L5YfTSdr0Q
— RevSportz Global (@RevSportzGlobal) April 6, 2026
పురుషుల సింగిల్స్లో సేన్, మహిళల సింగిల్స్లో సింధులు సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారు. భుజం గాయం నుంచి కోలుకుంటున్న హెచ్హెస్ ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్లు బరిలో దిగుతున్నా ఇటీవలి ఫామ్ దృష్ట్యా పతకం ఖాయమని చెప్పలేం. బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్షిప్స్లో దినేశ్ ఖన్నా 1965 పురుషుల సింగిల్స్లో స్వర్ణ పతకం గెలుపొందాడు.