సార్బ్రూకెన్(జర్మనీ) : హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ప్రిక్వార్టర్స్కు చేరుకున్నారు. బుధవారం జరిగిన పోరులో భారత జోడి 19-21, 21-19, 21-16 స్కోరుతో చైనీస్ తైపీ జోడి లీ యాంగ్-లు చెన్లపై విజయం సాధించారు. సాత్విక్-చిరాగ్ తొలి గేమ్ను కోల్పోయినా, తరువాతి రెండు గేమ్లలో పోరాడి గెలిచారు. మహిళల సింగిల్స్ ఇతర మ్యాచ్లలో మాళవిక బన్సూద్ 20-22, 21-12, 21-6తో క్లారా అజుర్మెండిపై, ఆకర్షి కశ్యప్ 21-11, 12-21, 21-7తో లియొనైస్ హ్యుట్పై గెలుపొందగా, సైనా నెహ్వాల్ 15-21, 8-21తో బుసానన్ ఒంగ్బామ్రంగ్ఫాన్ చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్లో హెచ్.ఎస్.ప్రణయ్, పురుషుల డబుల్స్లో అర్జున్-ధృవ్ కపిల జోడి వాకోవర్ ఇచ్చి పోటీనుంచి తప్పుకున్నారు.