ముంబై: వెస్టిండీస్తో జరిగే టెస్టు సిరీస్కు టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ జట్టులో ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)కు చోటు దక్కలేదు. దీనిపై కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇటీవల దేశవాళీ క్రికెట్లో దుమ్మురేపిన సర్ఫరాజ్ను టెస్టు జట్టులోకి ఎంపిక చేయకపోవడం కొందరు సీనియర్లు విస్మయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం క్రికెట్ వర్గాలు ఈ టాపిక్ హాట్గా సాగుతోంది. సునీల్ గవాస్కర్ బీసీసీఐ సెలక్షన్ ప్యానల్ను తప్పుపట్టారు. ఇక సర్ఫరాజ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్టు పెట్టారు. హోమ్ ప్రాక్టీస్ అని దానికి ట్యాగ్లైన్ ఇచ్చాడు. నెట్స్లో టెన్నిస్ బాల్ తో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను అప్లోడ్ చేశాడు.
దేశవాళీ క్రికెట్లో సర్ఫరాజ్ ఇటీవల భారీ ఇన్నింగ్స్లతో ఆకట్టుకున్నాడు. 37 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో అతను 3505 రన్స్ చేశాడు. అతని యావరేజ్ 79.65 ఉంది. 13 సెంచరీలు కొట్టాడు. దేశవాళీలో 301 అత్యధిక స్కోర్. ఇక ఏ లిస్టు క్రికెట్లో 469 రన్స్ స్కోర్ చేశాడతను. 26 మ్యాచుల్లో 39.08 సగటుతో అతను పరుగులు సృష్టించాడు. ఏ లీగ్ క్రికెట్లోనూ అతనికి రెండు సెంచరీలు ఉన్నాయి.
2022-23 రంజీ ట్రోఫీ సీజన్లో సర్ఫరాజ్ మొత్తం 92.66 యావరేజ్తో 556 రన్స్ చేశాడు. ఆరు మ్యాచుల్లో అతను మూడు సెంచరీలు కూడా చేశాడు. 2022 సీజన్లో అతను లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఆరు మ్యాచుల్లో 122 సగటుతో 982 రన్స్ చేశాడతను. దాంట్లో నాలుగు సెంచరీలు ఉన్నాయి. 2019-2020 సీజన్లోనూ రంజీల్లో టాప్ రన్ స్కోరర్గా సర్ఫరాజ్ నిలిచాడు. ఆరు మ్యాచుల్లో అతను 154 సగటుతో 928 రన్స్ స్కోర్ చేశాడు.