ముంబై: సోషల్ మీడియా ఇన్ప్లూయన్సర్ సప్నా గిల్(Sapna Gill)ను.. 14 రోజుల జుడిషియల్ కస్టడీ(Judicial custody)లోకి తీసుకున్నారు. క్రికెటర్ పృథ్వీ షా(Prithvi Shaw)పై ఆమె దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. సప్నా గిల్తో పాటు మరో ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు. షాపై దాడి కేసులో ఓషివారా పోలీసులు మొత్తం 8 మందిని అరెస్టు చేశారు. వారిపై ఐపీసీలోని 143, 148, 149, 384, 437, 504, 506 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. పృథ్వీ ఫ్రెండ్ ఆశిష్ సురేంద్ర యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గిల్ను అదుపులోకి తీసుకున్నారు.
ఓ హోటల్ వద్ద సెల్ఫీలు ఇచ్చేందుకు పృథ్వీ షా నిరాకరించడంతో.. సప్నా గిల్ తన మిత్రులతో కలిసి క్రికెటర్పై అటాక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కారులో ఆ క్రికెటర్ను వెంటాడి మరీ .. బ్యాట్లతో దాడికి ప్రయత్నించారు. క్రికెటర్ నుంచి 50 వేల డిమాండ్ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.