IPL 2023: ఐపీఎల్లో రాజస్థాన్ కోల్కతాతో జరిగిన మ్యాచ్లో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలు మెరుగుపరుచుకుంది. ఈ మ్యాచ్లో యశస్వీ జైశ్వాల్, యుజ్వేంద్ర చాహల్ రాణించడంతో రాజస్థాన్ 13.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
మ్యాచ్ అనంతరం రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్లో యశస్వీ అద్భుతంగా ఆడాడు. అతడి ఆటను నేను చాలా ఎంజాయ్ చేశాను. పవర్ ప్లేలో అతడు చాలా ప్రమాదకరమైన ఆటగాడు. ఆ విషయం ప్రత్యర్థి టీం బౌలర్లకు కూడా తెలుసు. అతడు మా టీంకు దొరకడం మా అదృష్టం అని అన్నాడు.
ఇక చాహల్ గురించి మాట్లాడుతూ.. బౌలింగ్ యుజీకి నేను చెప్పేదేముండదు. ఎందుకంటే ఎలా బౌలింగ్ చేయాలి.. ఎక్కడ బంతులేయాలి అనే విషయం అతడికి బాగా తెలుసు. అతడొక లెజెండ్ అని ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్లో యశస్వీ 98 పరుగులు సాధించగా యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లు పడగొట్టాడు.