హైదరాబాద్: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ అంటేనే అదో టెన్షన్. ఇక టీ20 వరల్డ్కప్లో ఆ రెండు జట్లు తలపడితే ఉత్కంఠమే. సోషల్ మీడియా జోరుగా సాగుతున్న ఈ రోజుల్లో ఆ వత్తిడిని తట్టుకోవడం కూడా కష్టమే. చిత్రవిచిత్రమైన కామెంట్లతో క్రికెట్ ప్రేమికులు ఆ మ్యాచ్పై మరింత ఆసక్తిని పెంచేస్తారు. అయితే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. ఈ ఆదివారం సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నది. ఆమె ఎందుకు ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కూడా చెప్పేసింది. దీని గురించి ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు కూడా పెట్టింది. సాధారణంగా ఇండియా, పాక్ మ్యాచ్ అంటేనే విద్వేష, విషపూరిత కామెంట్లు పోటెత్తుతాయి. అయితే పాకిస్థాన్ క్రికెటర్ షోయెబ్ మాలిక్ను హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పెళ్లాడిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఆ రోజు ఏదైనా పోస్టు చేస్తే, ఇక ట్రోలింగ్లు దూసుకువస్తాయని సానియా అభిప్రాయపడింది. అందుకే ఆ మ్యాచ్ రోజున సోషల్ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ఆమె చెప్పింది. ఇన్స్టా రీల్స్లో బై అంటూ ఆమె కామెంట్ పెట్టింది. దీనికి మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. గుడ్ ఐడియా అంటూ యువీ కామెంట్ చేశాడు.