హైదరాబాద్: భారత టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా..తన సుదీర్ఘ టెన్నిస్ కెరీర్కు త్వరలో వీడ్కోలు పలుకబోతున్నది. మూడు దశాబ్దాల క్రితం ఆరేండ్ల ప్రాయంలో తొలిసారి రాకెట్ పట్టిన ఈ హైదరాబాదీ తన కెరీర్లో ఎన్నో మరుపురాని విజయాలు సొంతం చేసుకుంది. ఓ బిడ్డకు జన్మనిచ్చినా..తనలో సత్తా తగ్గలేదని నిరూపిస్తూ టైటిళ్లు కొల్లగొట్టి సాటిలేదని చాటిచెప్పింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ మొదలవుతున్న నేపథ్యంలో సానియామీర్జా సోషల్మీడియాలో భావోద్వేగంగా ఒక లేఖ రాసుకొచ్చింది. ఇందులో కెరీర్ తొలి నుంచి ఇప్పటి వరకు తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, కుటుంబ సభ్యులు, కోచ్లు, సహచర ప్లేయర్లకు కృతజ్ఞతలు తెలిపింది. ఫిబ్రవరిలో దుబాయ్లో జరిగే టెన్నిస్ టోర్నీతో ఆటకు వీడ్కోలు పలుకుతానని ఇప్పటికే ప్రకటించింది.