అడిలైడ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మళ్లీ రాకెట్తో మెరిసింది. అడిలైడ్ ఇంటర్నేషనల్ టోర్నీలో భారత, ఉక్రెయిన్ ద్వయం సానియా, నదియా కిచెనోక్ 1-6, 6-3, 10-8 తేడాతో రెండో సీడ్ గాబ్రియెల్లా దబ్రోవ్స్కీ, ఒల్మాస్ జోడీపై అద్భుత విజయం సాధించింది. ప్రత్యర్థికి తొలి సెట్ను చేజార్చుకున్న సానియా-నదియా పుంజుకుని పోటీలోకి వచ్చింది. తమదైన జోరు కనబరుస్తూ రెండో సెట్ను కైవసం చేసుకోవడంతో పాటు ఆఖరి సెట్ను టైబ్రేక్లో దక్కించుకుని మ్యాచ్ను వశం చేసుకుంది. ఏటీపీ టూర్లో డబుల్స్లో తొలిసారి జత కట్టిన భారత ద్వయం రోహన్ బోపన్న, రామ్కుమార్ రామనాథన్ 6-2, 6-1 తేడాతో అమెరికా, బ్రెజిల్ జోడీ జెమీ సెరెటనీ-ఫెర్నాండో రంబోలీపై అలవోక విజయం సాధించింది.