న్యూఢిల్లీ: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది తొలి టైటిల్ పట్టేందుకు అడుగు దూరం లో నిలిచింది. ఒస్ట్రావా ఓపెన్ డబ్ల్యూటీఏ-500 టోర్నీలో సానియా-షుయె జాంగ్ (చైనా) జోడీ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో రెండో సీడ్ సానియా-జాంగ్ జంట 6-2, 7-5తో ఇరీ హోజుమి-నినోమియా (జపాన్) ద్వయంపై విజయం సాధించింది.