క్లీవ్లాండ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్లీవ్లాండ్ టోర్నీ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన డబ్ల్యూటీఏ-250 టోర్నీ మహిళల డబుల్స్ సెమీఫైనల్లో అన్సీడెడ్ సానియా-క్రిస్టినా మెక్హల్ (అమెరికా) జోడీ 7-6 (7/5), 6-2తో ఉల్రిక్కే ఎకెరీ (నార్వే)-క్యాథరిన్ హరిసన్ (అమెరికా) జంటపై విజయం సాధించింది. ఆదివారం జరుగనున్న ఫైనల్లో టాప్ సీడ్ షుకో అయామ-ఎనా షిబహారా (జపాన్) ద్వయంతో సానియా జోడీ తలపడనుంది.