క్లీవ్లాండ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-క్రిస్టినా మైఖేల్ (అమెరికా)జోడీ క్లీవ్లాండ్ చాంపియన్షిప్ క్వార్టర్స్లోకి ప్రవేశించింది. ఆదివారం రాత్రి ఇక్కడ జరిగిన మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో సానియా ద్వయం 6-3, 6-2తో ఒక్సానా కలాష్నికోవా-ఆండ్రియా మిటు జంటను చిత్తు చేసింది. మొదటి సెట్ అలవోకగా నెగ్గిన సానియా-క్రిస్టినా జోడి.. రెండో సెట్లోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు.