కొచ్చి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మినీ వేలానికి రంగం సిద్ధమైంది. కొచ్చి వేదికగా శుక్రవారం వేలం పాట జరుగనుంది. రానున్న సీజన్ కోసం ఆయా ఫ్రాంచైజీలు ప్లేయర్లపై భారీ ఖర్చు పెట్టేందుకు పక్కా ప్రణాళికతో రాబోతున్నాయి. నయా టీ20 ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్ నుంచి ఆల్రౌండర్లు బెన్ స్టోక్స్, సామ్ కరాన్, ఆసీస్ క్రికెటర్ గ్రీన్, పంజాబ్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్, విలియమ్స న్ భారీ ధర పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వాస్తవానికి జాబితాలో 991 ప్లేయర్లు ఉండగా ఫైనల్ లిస్టులో 405 మంది ఉన్నారు. ఇందులో 273 మంది భారతీయులు కాగా, 132 మంది విదేశీ క్రికెటర్లు. ఎక్కువలో ఎక్కువ 87 మందిని ఆయా ఫ్రాంచైజీలు తమ వశం చేసుకోనున్నాయి. ఇటీవలి టీ20 వరల్డ్కప్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా నిలిచిన కరాన్తో పాటు స్టోక్స్ కనీస ధర 2 కోట్లతో వేలంలోకి ప్రవేశిస్తున్నారు. పది మంది ఆటగాళ్లను వదులుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ దగ్గర అత్యధికంగా రూ.42.25 కోట్లు ఉండగా, కోల్కతా రూ.7.05 కోట్లతో ఆఖర్లో ఉంది.