న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)తో పోరాడుతున్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు సహచర క్రీడాకారిణి సాక్షి మాలిక్ మద్దతు ప్రకటించింది. మహిళాఅథ్లెట్లు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆటలో కొనసాగేందుకు ఎన్నో దేశాలు నిబంధనలు సడలిస్తుంటే.. పునరాగమనం చేస్తున్న వినేశ్ లాంటి మేటి ప్లేయర్ను కావాలనే అడ్డుకుంటున్నారని సోషల్ మీడియా పోస్టులో ఆరోపించింది.
ఈ విషయంలో ప్రధాని మోదీ, కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కల్పించుకొని వినేశ్కు న్యాయం చేయాలని కోరింది. మరోవైపు ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ పేర్కొన్నారు. ‘ఫెడరేషన్ ఒక ప్లేయర్ను పోటీ పడకుండా అడ్డుకోదు. ఒకవేళ అలా చేస్తుందంటే దాని వెనుక కచ్చితంగా ఓ కారణం ఉంటుంది. ప్రస్తుతం మేం ఆ మేడం (వినేశ్) సృష్టించిన అలజడిని డీల్ చేస్తున్నాం’ అని చెప్పారు.