పాట్నా: బీహారీ క్రికెటర్ షకీబుల్ గని రికార్డు క్రియేట్ చేశారు. మిజోరం జట్టుతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో.. అరంగేట్రం చేసిన 22 ఏళ్ల షకీబుల్.. ట్రిపుల్ సెంచరీ చేశాడు. 405 బంతుల్లో 341 రన్స్ చేసి ఔటయ్యాడు. దాంట్లో రెండు సిక్సర్లు, 56 ఫోర్లు ఉన్నాయి. కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్సిటీ క్యాంపస్లో జరుగుతున్న మ్యాచ్లో బీహార్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 686 రన్స్ చేసి డిక్లేర్ చేసింది. షకీబుల్ గనికి తోడుగా బాబుల్ కుమార్ కూడా రాణించాడు. నాలుగో వికెట్కు ఆ ఇద్దరూ 538 రన్స్ జోడించారు. బాబుల్ కుమార్ 229 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో అరంగేట్రం చేసిన గని.. గతంలో అజయ్ రోహిరా పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. 2018-19 రంజీ సీజన్లో రోహిరా తన తొలి మ్యాచ్లో అత్యధికంగా 267 రన్స్ చేశాడు. మూడవ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన మిజోరం భోజన విరామ సమయానికి 160 రన్స్ చేసి మూడు వికెట్లను కోల్పోయింది.