టోక్యో: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సైనా నెహ్వాల్ 21-9, 21-9తో చెంగ్ గాన్ యీ (హాంకాంగ్)పై విజయం సాధించింది. 38 నిమిషాల్లో ముగిసిన పోరులో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన సైనా.. వరుస గేమ్ల్లో ప్రత్యర్థిని చిత్తు చేసింది.
రెండో రౌండ్లో ఒకుహరాతో సైనా తలపడాల్సి ఉండగా.. గాయం కారణంగా ఆమె తప్పుకోవడంతో భారత షట్లర్ నేరుగా ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది. మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ, అశ్విని భట్-శిఖ గౌతమ్ జోడీలు తొలి రౌండ్లో విజయాలు సాధించాయి. మిక్స్డ్ డబుల్స్లో వెంకట్-జూహీ జంట శుభారంభం చేసింది.