IPL 2023 : ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేసింది. సొంత గ్రౌండ్లో టాపార్డర్ బ్యాటర్లు దంచి కొట్టారు. గత మ్యాచ్ సెంచరీ హీరో విఫలమైనా.. సాయి సుదర్శన్(96 : 47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్లు), వృద్ధిమాన్ సాహా(54 : 39 బంతుల్లో5 ఫోర్లు, 1 సిక్స్)హాఫ్ సెంచరీతో చెలరేగారు. దాంతో గుజరాత్ 4 వికెట్ల నష్టానికి 214 రన్స్ కొట్టింది. ఐపీఎల్ ఫైనల్లో రికార్డు స్కోర్ చేసిన జట్టుగా గుజరాత్ చరిత్ర సృష్టించింది. 2016 ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సన్రైజర్స్ హైదరాబాద్ కొట్టిన 208/7 స్కోర్ను అధిగమించింది.
Innings break!
Gujarat Titans set a mammoth target of 215 for the Chennai Super Kings 👌🏻
This will take some beating and we’re in for an entertaining run-chase in the FINAL folks 🙌
Scorecard ▶️ https://t.co/WsYLvLrRhp#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/2XBf0vDcuc
— IndianPremierLeague (@IPL) May 29, 2023
టాస్ ఓడిన గుజరాత్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. అయితే.. భీకర ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్(39)ను ధోనీ స్టంపౌట్ చేశాడు. 67 వద్ద గుజరాత్ తొలి వికెట్ పడింది. ఆ తర్వాత సాహా, సుదర్శన్ ఫోర్లు, సిక్స్లు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. పథిరణ వేసిన 20వ ఓవర్లో సాయి సుదర్శన్(96) వరుసగా రెండు సిక్స్లు కొట్టాడు. అతడి జోరు చూస్తే సెంచరీ కొడతాడనిపించింది. కానీ, మూడో బంతికి ఎల్బీగా ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రషీద్ ఖాన్(0) ఆఖరి బంతికి బౌండరీ వద్ద గైక్వాడ్ చేతికి చిక్కాడు.