బ్యాంకాక్: భారత స్టార్ షట్లర్ సాయి ప్రణీత్ థాయ్లాండ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 ప్రిక్వార్టర్స్లో గురువారం సాయి ప్రణీత్ 24-22, 7-21, 22-20తో జిన్ జియాన్ (కొరియా)పై గెలుపొందాడు.
శుక్రవారం జరుగనున్న క్వార్టర్స్లో లి షి ఫెంగ్ (చైనా)తో ప్రణీత్ తలపడనున్నాడు. ఇతర మ్యాచ్ల్లో కిరణ్ జార్జ్, అశ్మిత చలిహ పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్లో తెలంగాణ అమ్మాయి సిక్కిరెడ్డి-రోహన్ కపూర్ జంట రెండో రౌండ్లో 11-21, 10-21తో ఆరోసీడ్ ఫెంగ్ యాన్-డాంగ్ పింగ్ (చైనా) చేతిలో ఓడింది.