న్యూఢిల్లీ: భారత యువ టెన్నిస్ ప్లేయర్ జి సాయి కార్తీక్ రెడ్డి తొలి ఐటీఎఫ్ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. ట్యునీషియా వేదికగా జరిగిన టోర్నీ పురుషుల డబుల్స్లో సాయికార్తీక్-మనీశ్ సురేశ్ కుమార్ జోడీ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సాయి-మనీశ్ జంట 3-6, 6-3, 10-8తో భారత్కే చెందిన నిక్కీ పునాచా-రిత్విక్ చౌదరీ ద్వయంపై విజయం సాధించింది. తొలి సెట్లో పరాజయం పాలైన సాయి-మనీశ్.. ఆ తర్వాత విజృంభించారు. వరుసగా రెండు సెట్లు కైవసం చేసుకొని టైటిల్ కైవసం చేసుకున్నారు.