ముంబై : క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని చారిత్రక వాంఖడే స్టేడియంలో ప్రతిష్టించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమానికి సచిన్ తన భార్య అంజలి, కూతురు సారాతో కలిసి హాజరయ్యాడు. ఈ సందర్భంగా వాంఖడే స్టేడియంతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నాడు.
పదేళ్ల ప్రాయంలో తొలిసారి వాంఖడే స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చానని, తన స్నేహితులతో కలిసి నార్త్ స్టాండ్లో కూర్చుని సందడి చేసేవారమని గుర్తుచేశాడు. ధోనీని కెప్టెన్గా చేయాలని ఇక్కడే సూచించానన్నాడు. ఈ కార్య్రకమానికి బీసీసీఐ కార్యదర్శి జై షా, కోశాధికారి ఆషిష్ శెలార్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్, తదితరులు హాజరయ్యారు.