న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వరుసగా 20వ సారి యూనిసెఫ్ ‘గుడ్విల్ అంబాసిడర్గా’ఎంపికయ్యాడు. నిరుపేద పిల్లల సంక్షేమం కోసం కృషి చేస్తున్న యూనిసెఫ్తో సచిన్ టెండూల్కర్ 2003 నుంచి కలిసి పనిచేస్తున్నాడు. ‘రెండు దశాబ్దాల పాటు యూనిసెఫ్తో సాగడం చాలా గొప్ప విషయం. పిల్లల కలలకు రెక్కలు ఇచ్చేలా యూనిసెఫ్ చేస్తున్న ప్రయత్నాలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి.
ప్రభావవంతమైన పనికి సంబంధించిన అద్భుతమైన జ్ఞాపకాలు మా సొంతం. తదుపరి దశ భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నా’అని టెండూల్కర్ సోమవారం ట్వీట్ చేశాడు. 2003లో పోలియో నివారణపై అవగాహన కల్పించేందుకు తొలిసారి యూనిసెఫ్ అంబాసిడర్గా ఎంపికైన సచిన్.. 2008లో పారిశుధ్యం, పరిశుభ్రతను ప్రోత్సహించే విధంగా ప్రచారం చేశాడు. 2013లో దక్షిణాసియా యూనిసెఫ్ అంబాసిడర్గా పనిచేసిన టెండూల్కర్.. 2019లో సంస్థ కోసం మూడు రోజుల పాటు నేపాల్లో పర్యటించాడు.