ముంబై: రోడ్ సేఫ్టీ ప్రపంచ సిరీస్ క్రికెట్ పోటీల్లో పాల్గొనే ఇండియన్ లెజెండ్స్ జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సారథ్యం వహించనున్నాడు. సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న రెండో సీజన్ తొలి మ్యాచ్ కాన్పూర్లో నిర్వహించనుండగా.. సెమీఫైనల్స్, ఫైనల్స్కు రాయ్పూర్ స్టేడియం ఆతిథ్యమిస్తున్నది. గత సీజన్లో పాల్గొన్న ఇండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్ జట్లతోపాటు ఈసారి న్యూజిలాండ్ జట్టుకుడా బరిలోకి దిగనున్నది.