ముంబై: ఫుట్బాల్ మెగాస్టార్ డేవిడ్ బెక్హమ్(David Becham).. తొలిసారి ఇండియా టూర్లో ఉన్నాడు. ఆ ఇంగ్లండ్ ఫుట్బాలర్ .. బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన వరల్డ్కప్ సెమీస్ మ్యాచ్ను వీక్షించాడు. యునిసెఫ్ అంబాసిడర్గా అతను ఇండియాలో టూర్ చేస్తున్నాడు. ఫుట్బాలర్ బెక్హమ్తో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చాలా సమయాన్ని గడిపారు. వాంఖడే స్టేడియంలో కాసేపు తిరిగారు. మ్యాచ్ కోసం రెఢీ అయిన కివీస్, భారత క్రికెటర్లను కూడా బెక్హమ్ కలిశాడు. ఇక కోహ్లీతో కాసేపు చిట్చాట్ చేశాడు.
“A special person, a great footballer, and a @UNICEF Ambassador”
Legendary cricketer @sachin_rt‘s epic meetup with football great David Beckham illuminates Wankhede Stadium 🔥#CWC23 | #INDvNZ pic.twitter.com/QT6LHEq581
— ICC (@ICC) November 15, 2023
సచిన్తో మాట్లాడిన బెక్హమ్.. ఇండియాకు ఫస్ట్ టైం వచ్చినట్లు చెప్పాడు. ఈ టూర్ అద్భుతంగా ఉన్నట్లు ఆ ఫుట్బాలర్ వెల్లడించాడు. ఇండియాకు రావాలని చాన్నాళ్ల నుంచి ఎదురుచూస్తున్నానని, గుజరాత్లో ఓ చిన్నారుల స్కూల్కు వెళ్లినట్లు చెప్పాడు. ఓ యూనివర్సిటీకి కూడా వెళ్లి అక్కడ యువతను కలిసినట్లు తెలిపాడు. గుజరాత్లో పిల్లలతో కాసేపు క్రికెట్ ఆడినట్లు చెప్పాడు. ఫుల్ ఎంజాయ్ చేసినట్లు పేర్కొన్నాడు.
స్కూల్కు వెళ్తున్న రోజుల్లో క్రికెట్ ఆడేవాడినని, కాళ్లలో బంతికన్నా చేతుల్లో బ్యాట్ ఉంటేనే చాలా ఫ్రీగా ఉంటుందన్నాడు. వాంఖడే స్టేడియాన్ని తిప్పి చూసిన సచిన్.. ఆ స్టేడియంలో ఉన్న ప్రత్యేకతలను వివరించాడు. 2011లో ఇదే స్టేడియంలో తాము వరల్డ్కప్ను గెలిచినట్లు బెక్హమ్తో చెప్పాడు.
ఇంటర్ మియామి ఫుట్బాల్ క్లబ్ కో-ఓనరే బెక్హమ్. ఆ క్లబ్ తరపున ఫేమస్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ ఆడుతున్నాడు. బెక్హమ్-సచిన్ వీడియోను ఐసీసీ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ఆ వీడియోను వీక్షించండి.