టీమిండియాతో జరిగిన తొలి టెస్టులో భారత్కు విజయాన్ని దూరం చేసిన కివీ టెయిలెండర్లను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందించాడు. భారత్, న్యూజిల్యాండ్ జట్లు రెండూ అద్భుతంగా పోరాడాయని సచిన్ అన్నాడు. ‘మ్యాచ్లో ఒక్కో సందర్భంలో ఒక్కో జట్టు ప్రమాదకరమైన స్థితిలో నిలిచింది. కానీ ఆ పరిస్థితులకు ఎదురొడ్డి నిలిచాయి. మ్యాచ్ చివరి రోజున 52 బంతులు ఎదుర్కొని నిలబడటం మాటలు కాదు. ఇలాంటి ప్రదర్శనలే టెస్టు క్రికెట్ను ఆసక్తికరంగా మారుస్తాయి’ అని సచిన్ ట్వీట్ చేశాడు.
కాగా, ఐదో రోజు ఆటలో తొలి సెషన్లో ప్రభావం చూపలేకపోయిన భారత బౌలర్లు ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకున్నారు. మ్యాచ్ చివర్లో కివీస్ 9 వికెట్లు కోల్పోయింది. ఆ ఒక్క వికెట్ కూలిస్తే విజయం భారత్ వశమయ్యేది. అలాంటి పరిస్థితుల్లో రచిన్ రవీంద్ర, (91బంతుల్లో 18 నాటౌట్), అజాజ్ పటేల్ (23 బంతుల్లో 2 నాటౌట్) అడ్డుగోడల్లా నిలిచి మ్యాచ్ను డ్రా చేశారు. వీరిద్దరూ కలిసి 52 బంతులెదుర్కొని కేవలం 10 పరుగులు చేశారు. వీరి పోరాటాన్ని పలువురు మాజీలు మెచ్చుకున్నారు కూడా.