Rohit Sharma : గత కొన్నిరోజులుగా రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరు? అనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. శ్రీలంకతో తొలి వన్డేకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మకు ఇదే ప్రశ్న ఎదురైంది. అందుకు అతను కూల్గా స్పందించాడు. తర్వాతి కెప్టెన్ ఎవరనేది ఇప్పుడే చెప్పడం కష్టం. ప్రస్తుతానికి అందరి దృష్టి వన్డే వరల్డ్ కప్ మీదనే ఉంది. అంతేకాదు ఈ ఏడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఉంది. అప్పటి వరకు వేచి చూడండి అని రోహిత్ శర్మ బదులిచ్చాడు. తన టీ20 కెప్టెన్సీపై వస్తున్న వార్తలపై కూడా రోహిత్ పెదవి విప్పాడు. ప్రస్తుతం 3 టీ20లు అయ్యాయి. ఇంకా మూడు ఉన్నాయి. ఐపీఎల్ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పట్లో టీ20 క్రికెట్ నుంచి తప్పుకునే ఆలోచన లేదు అని రోహిత్ చెప్పాడు. గువాహటిలో రేపు శ్రీలంక, భారత్ మధ్య తొలి వన్డే జరగనుంది
రోహిత్ సారథ్యంలోని భారత జట్టు టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో దారుణంగా ఓడిపోయింది. అతడి కెప్టెన్సీలో ఇండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు దాంతో రోహిత్ శర్మ వారసుడు ఎవరు? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. టీ20ల్లో విజయవంతమైన కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నిరూపించుకుంటున్నాడు. అతని సారథ్యంలోని యువ భారత్ న్యూజిలాండ్, శ్రీలంకపై సిరీస్ గెలిచింది. ఐపీఎల్లోనూ కెప్టెన్గా అదరగొట్టాడు. గుజరాత్ టైటన్స్ను విజేతగా నిలిపాడు. దాంతో, పాండ్యాకు పొట్టి క్రికెట్ కెప్టెన్సీని అప్పంగించాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది.