పెర్త్: ఆస్ట్రేలియాతో మూడో టీ20 మ్యాచ్లో వెస్టిండీస్కు ఓదార్పు విజయం దక్కింది. మంగళవారం జరిగిన ఆఖరి పోరులో విండీస్ 37 పరుగుల తేడాతో ఆసీస్ను ఓడించింది. తొలుత అండ్రూ రస్సెల్(29 బంతుల్లో 71, 4ఫోర్లు, 7 సిక్స్లు), రూథర్ఫోర్డ్(67 నాటౌట్) అర్ధసెంచరీలతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 220/6 స్కోరు చేసింది. 79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన విండీస్ను రస్సెల్, రూథర్ఫోర్డ్ ఆదుకున్నారు. ముఖ్యంగా రస్సెల్ తన ఇన్నింగ్స్లో ఏడు భారీ సిక్స్లు, నాలుగు ఫోర్లతో దుమ్మురేపాడు. వీరిద్దరు ఆరో వికెట్కు 139 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. బార్ట్లెట్ (2/37) రెండు వికెట్లు తీశాడు. లక్ష్యఛేదనలో ఆసీస్ 183/5 స్కోరుకు పరిమితమైంది. వార్నర్ (81) ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది. ఆఖర్లో డేవిడ్ (41 నాటౌట్) పోరాడినా ఆసీస్ గెలుపు దక్కలేదు. షెఫర్డ్, రోస్టన్ చేజ్ రెండేసి వికెట్లు తీశారు. రస్సెల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.