న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక డచ్ ఓపెన్లో భారత ఆటగాడు లక్ష్యసేన్ రన్నరప్గా నిలిచాడు. ఆదివారం నెదర్లాండ్స్లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో టాప్సీడ్ లక్ష్యసేన్ 12-21, 16-21తో లోహ్ కీన్ (సింగపూర్) చేతిలో పరాజయం పాలయ్యాడు. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ప్రపంచ 25వ ర్యాంకర్ లక్ష్యసేన్.. తుదిపోరులో 41వ ర్యాంకర్ లోహ్ కీన్కు సరైన పోటీనివ్వలేకపోయాడు. 36 నిమిషాల్లో ముగిసిన తుదిపోరులో ఆద్యాంతం వెనుకబడ్డ లక్ష్యసేన.. వరుస సెట్లలో ఓడాడు. ఇదే టోర్నీ బరిలో దిగిన ఇతర భారత షట్లర్లు అజయ్ జయరామ్, సిరిల్ వర్మ, చిట్టబోయిన రాహుల్ తొలి రౌండ్లలోనే పరాజయాలు ఎదుర్కొనగా.. వరుస విజయాలతో ఫైనల్కు దూసుకెళ్లిన టాప్ సీడ్ లక్ష్యసేన్ తుదిమెట్టుపై తడబడ్డాడు. మహిళల విభాగంలో భారత్ నుంచి ఆకర్శి కశ్యప్ మాత్రమే సెమీస్ వరకు వచ్చింది. సామియా ఇమాద్ ఫారుఖీ, ఐరా శర్మ అంతకుముందే తమ పోరాటాన్ని ముగించారు.