హైదరాబాద్, ఆట ప్రతినిధి: థాయ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీలో రాష్ర్టానికి చెందిన శ్రీవల్లి రష్మిక, వైదేహి చౌదరి జోడీ రన్నరప్గా నిలిచింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ పైనల్లో రష్మిక, వైదేహి ద్వయం 6-7(3), 1-6తో రుతుజా భోంస్లే, ఎరికా సీమా జోడీ చేతిలో ఓటమిపాలైంది. గంటా 21నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో భారత జంట స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. మరోవైపు హైదరాబాదీ టెన్నిస్ ప్లేయర్ సహజ యమ్లపల్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ ఫైనల్లోకి ప్రవేశించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన మహిళల సింగిల్స్ సెమీస్లో సహజ 6-2, 6-1తో పెంగ్తార్న్ ప్లుపెచ్(థాయ్లాండ్)పై విజ యం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆరో సీడ్ మన్చాయ స్వాన్క్యుతో సహజ తలపడుతుంది.