చెన్నై: భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చెసెబుల్ మాస్టర్స్ ఆన్లైన్ టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచాడు. టై బ్రేకర్ ద్వారా ఫలితం తేలిన ఫైనల్లో 16 ఏండ్ల ప్రజ్ఞానంద తుదికంటా పోరాడాడు.
ప్రపంచ రెండో ర్యాంకర్ డింగ్ లిరెన్ (చైనా)తో జరిగిన తుదిపోరు తొలి అంచెలో 1.5-2.5తో వెనుకబడ్డ టీనేజ్ సంచలనం.. రెండో అంచెలో దుమ్మురేపాడు. 2.5-1.5తో చైనా ప్లేయర్కు షాకిచ్చి స్కోర్లు సమం చేశాడు. దీంతో విజేతను నిర్ణయించేందుకు టై బ్రేకర్ అనివార్యం కాగా.. కీలక పోరులో 29 ఏండ్ల లిరెన్ తన అనుభవాన్నంతా ఉపయోగించి ప్రజ్ఞానందపై విజయం సాధించాడు.