కీలకమైన క్వాలిఫైయర్ పోరులో బెంగళూరు బ్యాటర్లు చేతులెత్తేశారు. స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ (7), డుప్లెసిస్ (25), మ్యాక్స్వెల్ (24) ముగ్గురూ భారీ స్కోరు చేయలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన పటీదార్ (58) మరోసారి జట్టును ఆదుకున్నాడు. అయితే మహిపాల్ లోమ్రోర్ (8), దినేష్ కార్తీక్ (6), హసరంగ (0), హర్షల్ పటేల్ (1) విఫలమయ్యారు.
చివర్లో షాబాజ్ అహ్మద్ (12 నాటౌట్), జోష్ హాజిల్వుడ్ (1 నాటౌట్) కలిసి జట్టు ఆలౌట్ అవకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు జట్టు 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.
రాజస్థాన్ బౌలర్లలో చాహల్ మినహా అందరూ వికెట్లు తీసుకున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ, ఓబెడ్ మెకాయ్ చెరో మూడు వికెట్లతో సత్తా చాటగా.. బౌల్ట్, అశ్విన్ కూడా చెరో వికెట్ తీసుకున్నారు.