రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం దిశగా సాగుతున్నారు. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (51 నాటౌట్) రెచ్చిపోయి ఆడుతున్నాడు. అంతకుముందు కెప్టెన్ రోహిత్ (2), ఇషాన్ కిషన్ (26) ఇద్దరూ పవర్ప్లే ఓవర్లలోనే అవుటవడంతో ముంబై జట్టు కష్టాల్లో ఉన్నట్లు కనిపించింది.
అయితే సూర్యకుమార్ యాదవ్ మరోసారి ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తూ జట్టును ముందుకు నడిపించాడు. అతనికి తిలక్ వర్మ (27 నాటౌట్) నుంచి మంచి సహకారం అందింది. దీంతో 14 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు రెండు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ముంబై విజయానికి ఆరుఓవర్లలో 46 పరుగులు చేస్తే చాలు.