బెంగళూరు : ఐపీఎల్-19లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జోరు కొనసాగుతున్నది. ఆదివారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో బెంగళూరు.. మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను 43 పరుగుల తేడాతో ఓడించి సీజన్లో రెండో విజయాన్ని నమోదుచేయగా సీఎస్కేకు ఇది హ్యాట్రిక్ ఓటమి కావడం గమనార్హం. మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. టిమ్ డేవిడ్ (25 బంతుల్లో 70 నాటౌట్, 3 ఫోర్లు, 8 సిక్స్లు) ఊచకోతకు తోడు దేవ్దత్ పడిక్కల్ (29 బంతుల్లో 50, 5 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ రజత్ పటీదార్ (19 బంతుల్లో 48 నాటౌట్, 1 ఫోర్, 6 సిక్స్లు), ఫిల్ సాల్ట్ (30 బంతుల్లో 46, 3 ఫోర్లు, 2 సిక్స్లు) వీరవిహారంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 250 పరుగుల రికార్డు స్కోరు చేసింది. కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సీఎస్కే.. 19.4 ఓవర్లకు 207 రన్స్ వద్దే ఆగిపోయింది.
టాపార్డర్ విఫలమైనా సర్ఫరాజ్ (50), ప్రశాంత్ (43), ఓవర్టన్ (37) పోరాటంతో ఆ జట్టుకు అవమానకర ఓటమి నుంచి తప్పించారు. భువనేశ్వర్ (3/41), కృనాల్ (2/36), డఫ్ఫీ (2/58) చెన్నైని కట్టడిచేశారు. భారీ ఛేదనలో సంజూ (9) మరోసారి నిరాశపరచగా గత మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ఆయుష్ మాత్రె (1), కెప్టెన్ రుతురాజ్ (7) దారుణంగా విఫలమయ్యారు.ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన భువీ.. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి సీమర్గా రికార్డులకెక్కాడు.