అమ్స్టెల్వీన్ (నెదర్లాండ్స్): తిరుగులేని ఆటతో విజృంభించిన ఇంగ్లండ్ జట్టు.. వరుసగా మూడో మ్యాచ్లోనూ నెదర్లాండ్ను చిత్తుచేసి 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఆఖరి వన్డేలో ఇంగ్లిష్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మొదట నెదర్లాండ్స్ 49.2 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది. స్కాట్ ఎడ్వర్ట్స్ (64) టాప్ స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఇంగ్లిష్ జట్టు 30.1 ఓవర్లలో 2 వికెట్లకు 248 పరుగులు చేసింది. ఓపెనర్ జాసెన్ రాయ్ (101 నాటౌట్; 15 ఫోర్లు) అజేయ సెంచరీతో విజృంభించగా.. జోస్ బట్లర్ (64 బంతుల్లో 86 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాయ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, బట్లర్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.