బ్రిడ్జ్టౌన్: వెస్టిండీస్ బ్యాటర్ రోవ్మాన్ పావెల్ పవర్ఫుల్ షాట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్తో జరిగిన నాలుగవ టీ20లో అతను 51 బంతుల్లోనే సెంచరీ చేశాడు. బార్బడోస్లో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 224 రన్స్ చేసింది. పావెల్ మొత్తం 53 బంతుల్లో 107 రన్స్ చేసి ఔటయ్యాడు. దాంట్లో 10 సిక్సులు ఉన్నాయి. టీ20ల్లో పావెల్కు ఇదే తొలి సెంచరీ. మూడవ వికెట్కు నికోలస్ పూరన్తో కలిసి అతను 122 రన్స్ జోడించాడు. పూరన్ కూడా కేవలం 43 బంతుల్లో 70 రన్స్ చేశాడు. భారీ టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పయి 204 రన్స్ మాత్రమే చేసింది. టామ్ బాటన్ 73, ఫిల్ సాల్ట్ 57 రన్స్ చేశారు. ఈ విజయంతో విండీస్ సిరీస్లో 2-1 ఆధిక్యాన్ని సాధించింది.