ముంబై: ఈ ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు కష్టకాలం నడుస్తోంది. ఇప్పటికే వరుగా మూడు మ్యాచుల్లో ఆ జట్టు ఓడింది. దీనికి తోడు టోర్నీకి ముందే కెప్టెన్సీని మార్చడం కూడా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. రోహిత్(Rohit Sharma)ను తొలగించి.. హార్దిక్ పాండ్యాకు పగ్గాలు ఇవ్వడం .. ముంబై అభిమానులను ఆందోళనకు గురిచేసింది. పాండ్యా నేతృత్వం వల్లే ఆ జట్టు ఓడిపోతోందని విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆ జట్టు పదో స్థానంలో ఉన్నది. రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో అనేక మంది ఆగ్రహంతో ఉన్నారు. అయితే సోమవారం రాజస్థాన్ రాయల్స్తో వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిర్వాహకులు రోహిత్ శర్మ పేరుమీదున్న ప్లకార్డులను అనుమతి ఇవ్వలేదు. బాలీవుడ్ చిత్రంలోని ఓ ఫేమస్ డైలాగ్ ఆ ప్లకార్డుపై రాసి ఉన్నది. అయితే వాంఖడే స్టేడియం బయిటే ఆ ప్లకార్డును వదిలేశారు. రిస్తే మే తో హమ్ తుమ్హారే, కెప్టెన్ బాప్ ల్తే హై అన్న డైలాగ్ ఉన్నది.
Mumbai Indians management not allowing any Rohit Sharma posters inside the stadium.
This is hypocrisy at its best. Fans are biggest Stakeholders in IPL and cricket.
Then why should fans buy your tickets??.Shame ! #RohitSharma #MumbaiIndians pic.twitter.com/tomvTRWIhf
— 🕊️ (@retiredMIfans) April 1, 2024