న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma).. ఇండ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో ఇప్పటి వరకు పెద్దగా రాణించలేదు. తొలి టెస్టులో అతను ఫస్ట్ ఇన్నింగ్స్లో 24, సెకండ్ ఇన్నింగ్స్లో 39 రన్స్ స్కోర్ చేశాడు. ఇక వైజాగ్లో జరిగిన రెండో టెస్టులోనూ అతను స్వల్ప స్కోర్లకే నిష్క్రమించాడు. ఆ టెస్టులో అతను తొలి ఇన్నింగ్స్లో 14, రెండవ ఇన్నింగ్స్లో 13 రన్స్ మాత్రమే చేశాడు.
రేపటి నుంచి ఇంగ్లండ్తో రాజ్కోట్లో మూడవ టెస్టు మ్యాచ్ జరగనున్నది. అయితే ప్రస్తుతం రోహిత్ బ్యాటింగ్లో కొంత తడబడుతున్నట్లు తెలుస్తోంది. రాజ్కోట్లో ప్రాక్టీస సమయంలో ఓ అనామక బౌలర్ చేతిలో రోహిత్ రెండు సార్లు ఔటైనట్లు తెలుస్తోంది. ఓ స్థానిక బౌలర్ వేసిన బౌలింగ్లో రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక ఆ తర్వాత బంతికే అతను స్లిప్స్కు క్యాచ్ ఇచ్చాడు.
ప్రాక్టీసు సెషన్లో ఇబ్బందిపడ్డ రోహిత్.. రేపు ప్రారంభం అయ్యే మూడవ టెస్టులో ఎలా ఆడుతాడన్నదే ఆసక్తిగా మారింది. నెట్ బౌలర్ను ఎదుర్కొవడంలో ఇబ్బందిపడ్డ అతను రేపటి మ్యాచ్లో ఇన్నింగ్స్ను ఎలా ఆరంభిస్తాడో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
విరాట్, రాహుల్, శ్రేయాస్లు ఈ మ్యాచ్కు దూరంగా ఉన్న కారణంగా.. సర్ఫరాజ్, పటిదార్లకు ఛాన్సు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వికెట్ కీపర్గా కేఎస్ భరత్ స్థానంలో ద్రువ్ జురెల్ను తీసుకునే అవకాశం ఉంది.