పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో రోహన్ బోపన్న, మిడిల్కూప్ జోడీ సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ మూడో రౌండ్లో బోపన్న, మిడిల్కూప్(నెదర్లాండ్స్) ద్వయం 6-7(7), 7-6(3), 7(12)-6(10) తేడాతో డిఫెండింగ్ చాంపియన్ క్రొయేషియా జోడీ మెక్టిక్, మాటె పవిచ్పై అద్భుత విజయం సాధించింది. రెండున్నర గంటల పాటు ఉత్కంఠగా సాగిన పోరులో బోపన్న, మిడిల్కూప్ అసమాన పోరాట పటిమ కనబరిచింది. నువ్వానేనా అన్నట్లు హోరాహోరీగా సాగిన ప్రతీ సెట్ అభిమానులను ఆకట్టుకుంది. సోమవారం జరిగే క్వార్టర్స్లో గ్లాస్పూల్, హెలీవరాతో బోపన్న, మిడిల్కూప్ తలపడుతుంది. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సానియా-హర్డెకా (చెకోస్లోవేకియా) జంట 6-3 6-4తో జువన్-జిదాన్సెక్ (స్లోవేనియా) ద్వయాన్ని చిత్తు చేసింది.