మియామి: యూఎస్లో జరుగుతున్న మియామి ఓపెన్లో రోహన్ బోపన్న జోరు కొనసాగిస్తున్నాడు. మంగళవారం జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్లో బోపన్న, మాథ్యూ ఎబ్డెన్(ఆస్ట్రేలియా) జోడీ 7-5, 7-6(3) తేడాతో హ్యుగో నైస్, జన్ జిలెన్స్కీ ద్వయంపై గెలిచి క్వార్టర్స్లోకి ప్రవేశించింది. మరోవైపు మహిళల సింగిల్స్లో ఇగా స్వియాటెక్ 4-6, 2-6 తేడాతో 14వ సీడ్ అలెగ్జాండ్రోవా చేతిలో ఓడింది.