హాంగ్జూ: ఆసియా క్రీడల్లో(Asian Games) ఇండియాకు మరో స్వర్ణ పతకం దక్కింది. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో బొపన్న జోడికి పతకం వచ్చింది. టెన్నిస్ ఈవెంట్లో ఇండియా మొత్తం రెండు మెడల్స్ మాత్రమే కైవసం చేసుకున్నది. ఇవాళ జరిగిన మిక్స్డ్ డబుల్స్ గేమ్లో బొపన్న, రుతుజా భోస్లే అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. తొలుత ఓ సెట్ను కోల్పోయినా.. ఆ తర్వాత ఇద్దరూ తమ పవర్ గేమ్తో ఆకట్టుకున్నారు. రెండో సీడ్గా బరిలోకి దిగిన బొపన్న-భోస్లే జోడి 2-6, 6-3, 10-4 తేడాతో తైపికి చెందిన సుంత్ హో హువాంగ్, ఇన్ షౌ లియాంగ్ జంటపై గెలుపొందారు.
𝙂𝙊𝙇𝘿 𝙄𝙏 𝙄𝙎!🥇🌟
🇮🇳 mixed doubles duo, @RutujaBhosale12 and #TOPSchemeAthlete @rohanbopanna have clinched GOLD, showcasing their unmatched talent and teamwork on the world stage. 🏆🎾
Let's applaud their remarkable victory at the #AsianGames2022 with pride and passion!… pic.twitter.com/kpZs1JcLq4
— SAI Media (@Media_SAI) September 30, 2023
రెండవ సెట్లో 27 ఏళ్ల భోస్లే విరోచిత ఆటను ప్రదర్శించింది. స్టన్నింగ్ రిటర్న్ షాట్స్తో కేక పుట్టించింది. సాకేత్ మైనేని, రామ్కుమార్ రామనాథన్లతో కూడిన పురుషుల డబుల్స్ జోడి శుక్రవారం జరిగిన మ్యాచ్లో సిల్వర్ పతకాన్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఆసియా క్రీడల్లో బొప్పన్నకు స్వర్ణ పతకం దక్కడం ఇది రెండోసారి.