Padma Shri Award: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో క్రీడారంగానికి చెందిన పలువురికి అవార్డులు వరించాయి. భారత అత్యున్నత పురస్కారాలలో నాలుగో అవార్డు అయిన పద్మశ్రీని ఏడుగురు క్రీడాకారులు అందుకున్నారు. బ్యాడ్మింటన్ దిగ్గజం రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జ్యోష్న చిన్నప్పలు ఈ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్లో పురుషుల డబుల్స్లో వరుస విజయాలతో ఫైనల్ చేరిన బోపన్న.. ఇటీవలే ఏటీపీ ర్యాంకింగ్స్లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కర్నాటక ప్లేయర్ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.
పద్మశ్రీ అవార్డులు సాధించినవారిలో రోహన్ బోపన్న (బ్యాడ్మింటన్)తో పాటు ఇటీవలే స్క్వాష్ లో ఆసియా గేమ్స్లో పతకం సాధించిన జ్యోత్స్న చిన్నప్ప, పారా స్విమ్మర్ సత్యేంద్ర సింగ్ లోహియా, ఆర్చర్ పూర్ణిమ మహతో, మాజీ హాకీ ప్లేయర్ హర్బిందర్ సింగ్లు అవార్డులు దక్కించుకున్నారు. పద్మశ్రీలు అందుకున్న క్రీడాకారుల జాబితా ఇదే..
JOSHNA CHINAPPA GETS PADMA SHRI: 26/1/2024
Joshna Chinappa has been selected for the prestigious Padma Shri honor by the Indian Government.
Joshna Chinappa, at the age of 37, has won multiple medals at the Asian Games and is a two- time Commonwealth Games (CWG)
medalist. pic.twitter.com/H8y2iJgray— ISP Squash-India (@IspSquash) January 26, 2024
– రోహన్ బోపన్న (బ్యాడ్మింటన్ – కర్నాటక)
– జ్యోత్స్న చిన్నప్ప (స్క్వాష్ – తమిళనాడు)
– ఉదయ్ విశ్వనాథ దేశ్పాండే (మల్లకంభ్ కోచ్ – మహారాష్ట్ర)
– గౌరవ్ ఖన్నా (పారా బ్యాడ్మింటన్ కోచ్ – ఉత్తరప్రదేశ్)
– సత్యేంద్ర సింగ్ లోహియా (పారా స్విమ్మర్ – మధ్యప్రదేశ్)
– పూర్ణిమా మహాతో (ఆర్చర్ – జార్ఖండ్)
– హర్బిందర్ సింగ్ (మాజీ హాకీ ప్లేయర్ – ఢిల్లీ)