కరాచీ: పాకిస్థాన్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ .. టీ20ల్లో కొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే ఏడాదిలో టీ20 ఫార్మాట్లో రెండు వేల పరుగులను స్కోర్ చేసిన క్రికెటర్గా నిలిచాడు. కరాచీలో గురువారం వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఆ మైలురాయిని దాటేశాడు. 208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ మరో ఓవర్ ఉండగానే లక్ష్యాన్ని అందుకున్నది. అయితే ఈ మ్యాచ్లో రిజ్వాన్ చెలరేగి ఆడాడు. కేవలం 45 బంతుల్లో 87 రన్స్ చేశాడు. దాంట్లో పది ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. మూడు మ్యాచ్ల సిరీస్ను పాక్ 3-0 తేడాతో కైవసం చేసుకున్నది. విండీస్ జట్టులో పూరన్ 37 బంతుల్లో 64 రన్స్ చేశాడు.ఓపెనర్లు బ్రాండన్ కింగ్ 43, బ్రూక్స్ 49 రన్స్ చేశాడు.